Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ నాయకుల హౌస్ అరెస్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ నాయకులను అరెస్టు చేయలేదని, వారిని హౌస్ గెస్టులుగా ఉంచబోమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. జమ్మూకాశ్మీర్ నాయకులను వారి వీఐపీ బంగళాల్లోనే ఉంచాం. వారికి హాలీవుడ్ సినిమాల సీడీలు కూడా అందిస్తున్నాం. నేతలకు జిమ్ సౌకర్యాలు కూడా కల్పించాం. నాయకులను తాము హౌస్ అరెస్టు చేయలేదని, వారిని హౌస్ అతిధులుగా ఉంచామని జితేంద్రసింగ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రులు ఓమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో సహా పలువురు కాశ్మీర్ రాజకీయ నాయకులను ఆగస్టు 5వ తేదీ నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు.