Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తిరువారూర్ జిల్లా ఇరవాంజేరిలో పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన కేసులో కానిస్టేబుల్ అరెస్టు అయ్యారు. పూంగుడిమలై గ్రామంలో వినాయకర్ ఆలయం వుంది. రెండేళ్ల క్రితం ఈ ఆలయంలోని పంచ లోహ వినాయక విగ్రహం చోరీ జరిగింది. ఈ ఘటనపై రాష్ట్ర విగ్రహాల స్మగ్లింగ్ నియంత్రణ విభాగం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుచ్చి పోలీస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న పొన్రాజ్ అతని స్నేహితులు కలిసి విగ్రహం చోరీ చేసినట్లు తెలిసింది. దీంతో పొన్రాజ్ను పోలీసులు అరెస్టుచేసి కుంభకోణం అదనపు న్యాయస్థానంలో హాజరుపరచగా, అక్టోబరు 4వ తేదీ వరకు రిమాండ్కు తరలించి విచారించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.