Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ లో నలుగురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి తల్లి కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి వరలక్ష్మి మృతిచెందగా, నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు ఇందు, ఉమాదేవి, ఐశ్వర్య, ఉదయ్ కుమార్ లను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.