Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : అక్టోబర్ 11న ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల శిఖరాగ్ర సమావేశం జరుగనున్న కాంచీపురం జిల్లా కోవళం, మహాబలిపురం ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. మహాబలిపురంలో వీరిద్దరూ శిల్పకళా సంపదలున్న ప్రాంతాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా సముద్రతీర ఆలయం, పాండవుల రథం, కుడ్యశిల్పాల ప్రాంతాన్ని తిలకించనున్నారు. ఈ నేపథ్యంలో మహాబలిపురం పంచరథాలున్న ప్రాంతంలోని సమీపంలో ఉన్న దుకాణాలను అక్టోబర్ మొదటివారం నుంచే మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. అదే విధంగా శిల్పకళా సంపదలున్న ప్రాంతాల్లో ఉన్న ఆస్బెస్టాస్ కుర్చీలను తొలగించారు. మహాబలిపురంలోని లాడ్జీలు, రెస్టారెంట్లలో విదేశీయులు వస్తే తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా మహాబలిపురానికి చేరువగా వున్న జాలర్ల కుప్పాలలో రాత్రిపూట ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే తెలుపాలని పోలీసులు హెచ్చరించారు. ఇక పంచరథాలు, కుడ్యశిల్పాల ప్రాంతాల వద్ద పోలీసులు అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.