Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తితిదే 50వ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరుమలలో జరిగింది. గరుడాళ్వార్ సన్నిధిలో సభ్యులచే జేఈవో బసంత్కుమార్ ప్రమాణం చేయించారు. తితిదే పాలకమండలి సభ్యులుగా శ్రీనివాస్, పార్థసారధి, రమణమూర్తి, మురళీ కృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావు ప్రమాణం చేశారు. అనంతరం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరగనుంది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ నిధుల కుదింపు అంశంపై చర్చించనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవారి ప్రసాదం ముడి సరకుల కొనగోలు, సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.రూ.100 కోట్లతో తిరుపతిలో హాస్టల్ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలపనుంది. తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం-5 నిర్మాణం, తిరుపతిలో గరుడ వారధి నిర్మాణానికి నిధులు కేటాయింపులను బోర్డు ఆమోదించనుంది.