Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆర్టీసీ ఐకాస భేటీ అయ్యింది. అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఐకాస నేతలు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వాత్థామరెడ్డితోపాటు, బీజేపీ నుంచి రామచంద్రరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. సమ్మె వ్యూహంపై అఖిలపక్షంలో చర్చిస్తున్నారు. భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. భేటీ సందర్భంగా అశ్వాత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని, ఆర్టీసీని బతికించుకోవడమే లక్ష్యమన్నారు. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని, కార్మికులు దాచుకున్న ఫీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీపై డిజిల్ భారం ఎక్కువైందని, డిజిల్ పై 27శాతం పన్ను వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్నారని, వారంతా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. అవసరమైతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.