Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ: వాతావరణ కాలుష్యం మానవాళి మొత్తాన్ని అంతం చేయగలదని ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ హెచ్చరించారు. పెరుగుతున్న భూతాపం, కాలుష్యంపై ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఐఐపీఈ 4వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పర్యావరణహిత వనరుల వినియోగం దిశగా మౌలిక వసతులు, పరిజ్ఞానం అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ప్రజలు బాధ్యత తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ప్రపంచ స్థాయి సంస్థలతో ఐఐపీఈ ఎంఓయూలు కుదుర్చుకోవడం అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు ఐఐపీఈ ప్రాంగణాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, ఐఐపీఈ డైరక్టర్ వీఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు.