Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన బ్లాక్ బస్టర్ 'శ్రీమంతుడు' తరువాత ఈ కాంబినేషన్లో మరే సినిమా రాలేదు. శ్రీమంతుడు సినిమా విజయం తరువాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థలో మహేశ్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ అభిప్రాయభేదాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో తీసుకున్న అడ్వాన్స్ని మహేశ్ వెనక్కిచ్చేశాడు. ఇటీవల అమెరికాలో మైత్రీ అధినేత నవీన్ యెర్నేని సూపర్ స్టార్ మహేశ్తో కలిసి తమతో ఓ సినిమా చేయాల్సిందిగా కోరారట. ప్రస్తుతం వంశీ పైడిపల్లితో మహేశ్ చేయాల్సిన సినిమా ఆగిపోయిందని అంటున్నారు. దీంతో మహేశ్ మైత్రీ మూవీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ సినిమాకు 'గీతా గోవిందం' ఫేం పరశురాం దర్శకుడిగా పనిచేయనున్నారని, మే నెలలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం మహేశ్ పారితోషికం ఏకంగా 50 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ సమాచారం తెలియాల్సి ఉంది.