Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ‘రాహువు సూర్యుడిని పట్టుకుంటే గ్రహణం అంటాం. అప్పుడు అంతా చీకటి. మనలోని భయం మన చూపును పట్టుకుంటే హిస్టిరికల్ బ్లైండ్నెస్ అంటాం. అప్పుడు కూడా అంతా చీకటే’ అంటోంది ‘రాహు’ చిత్ర టీం. అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా నటించిన చిత్రమిది. సుబ్బు వేదుల దర్శకుడు. ఏవీఆర్ స్వామి, శ్రీశక్తి బాబ్జీ, రాజా దేవరకొండ నిర్మాతలు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ట్రైలర్ సాగింది. రక్తం చూస్తే కళ్లు కనిపించని ఆ అమ్మాయికి ఎలాంటి ఆపద ఎదురైంది? తన భయాన్ని ఎలా పొగొట్టుకుంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.