Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్: భారత్తో జరిగిన తొలి టెస్టుమ్యాచ్లో ఆతిథ్య కివీస్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. కివీస్.. మరో రోజు మిగిలుండగా, నాలుగో రోజు తొలి సెషన్లోనే ఆట ముగించడం గమనార్హం. 9 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 1.4 ఓవర్లలోనే లాంఛనాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 7 పరుగులు, టామ్ బ్లండెల్ 2 పరుగులు సాధించి కివీస్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.