Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో గర్భిణి షహనాజ్ మృతి చెందింది. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందింది. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించారు. గర్భిణిగా ఉన్న సమయంలో షహనాజ్కు స్వైన్ ఫ్లూ సోకడంతో తొలుత వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందజేశారు. అయితే పరిస్థితి విషమించడంతో గత మంగళవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఈరోజు తెల్లవారుజామున ఆమె కన్నుమూసింది. అయితే గాంధీ ఆస్పత్రిలో చేరిన సమయంలో వైద్యం సరిగా చేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో డ్యూటీ డాక్టర్లకు వైద్యశాఖ అధికారులు మెమో జారీ చేశారు. మహిళ గత ఐదు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందింది. షహనాజ్ స్వస్థలం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్. మహిళ మృతితో ఆమె స్వస్థలంలో విషాదఛాయలు అలుముకున్నారు.