Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాచిగూడ: రైల్లో ప్రయాణికుడి ల్యాప్టాప్ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు కథనం ప్రకారం.. బెంగళూర్ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమారుడు సిల్వేరు సతీశ్(32) సాఫ్ట్వేర్ ఉద్యోగి. యశ్వంత్పూర్-కాచిగూడ రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్కు వస్తున్నాడు. మార్గమధ్యలో కర్నూల్ రైల్వేస్టేషన్ సమీపంలో సతీశ్ .. తన బ్యాగు చూడగా ల్యాప్టాప్, 2 సెల్ఫోన్లు, ఖరీదైన వస్తువులు కన్పించలేదు. వెంటనే అతడు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేపీహెచ్బి కాలనీ, మలేషియా టౌన్షిప్ ప్రాంతానికి చెందిన దొడ్డవారపు శివప్రసాద్(67) ప్రైవేటు ఉద్యోగి. బెంగళూర్ రైల్వేస్టేషన్లో మైసూర్-కాచిగూడ రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్కు వస్తున్నాడు. మార్గమధ్యలో గద్వాల్ రైల్వేస్టేషన్ సమీపంలో శివప్రసాద్ జేబు చూసుకోగా సెల్ఫోన్, ఖరీదైన వస్తువులు కన్పించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్నగర్ రైల్వేపోలీస్స్టేషన్కు బదిలీచేసినట్లు రైల్వే ఎస్సై పి.సంగమేశ్వర్ తెలిపారు.