Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: కశ్మీర్ ఘాటీలో ఈరోజు పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకున్నాయి. మూడు నెలల సుదీర్ఘ శీతాకాలం సెలవుల అనంతరం విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (కశ్మీర్) మొహమ్మద్ యూసిన్ మాలిక్ మాట్లాడుతూ పట్టణప్రాంతాల్లోని పాఠశాలలు ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 3 గంటల వరకూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి 3.30 వరకూ పాఠశాలలు నడవనున్నాయని తెలిపారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.