Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనాపై పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు మరో సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. జన్యు స్వరూపంలో భిన్నంగా ఉన్న ఓ కరోనా వైరస్ రకాన్ని గుర్తించారు. దానికి 'క్లేడ్ ఏ3ఐ' అని పేరు పెట్టారు. ఈమేరకు వివరాలతో సీసీఎంబీ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ రకాల్లో ఏ3ఐ రెండో స్థానంలో ఉంటుందని తెలిపింది. మొదటి స్థానంలో 'ఏ2ఏ' రకం కొవిడ్-19 వైరస్ ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లకు కారణభూతాలవుతున్న కరో నా వైర్సల 213 జన్యువులను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కరోనా వైరస్ రకాల్లోనూ 'ఏ3ఐ' 3.5 శాతం మేర ఉన్నట్లు గతంలో జరిగిన అధ్యయనాల్లో బహిర్గతమైందని గుర్తుచేసింది.