Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉన్నది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో దేశంలో నమోదవుతున్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 86 శాతం కేసులు పది రాష్ట్రాల నుంచే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాదాపు 50 శాతం పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేకాధికారి రాజేష్ భూషణ్ చెప్పారు. మిగతా ఎనిమిది రాష్ట్రాల్లో 36 శాతం కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.