Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా47వేలు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది మరణించారు. 4,743 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,47,324కి చేరింది. వీరిలో 47,912మంది చికిత్స పొందుతుండగా 97,310మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 2,099మంది మృత్యువాతపడ్డారు.