Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని డ్రైవర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానంతో తన ఇంటి ముందు నిలిపిన ద్విచక్రవాహనాన్ని యజమాని తగులబెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లీకి చెందిన ఓ యువకుడు మంగళవారం అశ్వారావుపేటలోని బంధువుల దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలో బంధువుల ఇంటికి సమీపంలో ఉన్న మరో ఇంటి ముందు తన ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. సదరు యజమాని వచ్చి 'నీకు కరోనా ఉంది. మీ ప్రాంతంలోనూ కరోనా విజృంభిస్తోంది.అలాంటప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చావు?' అని అడిగాడు. మా ఇంటి ముందుకు ఎందుకు వాహనం పెట్టావంటూ.. అదే వాహనంలోని పెట్రోల్ తీసి తగులబెట్టాడు. బాధితుడు అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ద్విచక్రవాహనాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.