Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కారు తెచ్చిన మార్పులు అత్యంత క్రూరమైనవని, చట్ట వ్యతిరేకమైనవని ఆరోపిస్తూ, 17 రాష్ట్రాలు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా న్యాయస్థానంలో సవాలు చేశాయి. ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ హార్వార్్డ, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్ లు వ్యతిరేకంగా కేసులు దాఖలు చేసిన కొద్ది రోజులకే 17 రాష్ట్రాలు, ప్రముఖ ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలు అదే దారిలో నడవడం గమనార్హం. కరోనా మహమ్మారిని బూచిగా చూపిస్తూ, విదేశీ విద్యార్థులను తరిమేయడం హేయమైన చర్యని రాష్ట్రాల తరఫున కేసును వాదించనున్న మసాచుసెట్స్ అటార్నీ జనరల్ మౌరా హీలీ మండిపడ్డారు. కాగా, యూఎస్ లో విద్యాభ్యాసం చేసే విదేశీ విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల విధానాన్ని ఎంచుకుంటే, వారు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనని ఈ నెల 6వ తేదీన యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్శిటీల్లో చదువుకుంటుండగా, పలు వర్శిటీలు ఈ సంవత్సరం ఆన్ లైన్ మాధ్యమానికి మళ్లాయి.