Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో ఒరిస్సా, విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొని వచ్చి హైదారాబాద్లో విక్రయిస్తున్న నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కెఎస్రావులు తెలిపిన వివరాల ప్రకారం యూసూఫ్గూడ లోని యాదగిరి నగర్లో, కష్ణానగర్లో ఉంటున్న ఐదుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి గంజారు విక్రయిస్తుండగా, పక్కా సమాచారంతో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సత్తయ్య ఆదేశాల మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ తన సిబ్బందితో కలిసి ఎ2. నిందితుడైన చేతన్ కుమార్ (20), ఏ3. నిందితుడైన అబ్రార్ బీన్ హుస్సేన్(20) ఎ4. ఉదార రమేష్(19), ఏ5 శాన్యం శివారెడ్డిల ఇండ్లపై దాడి చేసి రెండు లక్షల విలువగల పది కేజీల మూడు వందల ఇరవై గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుండి మూడు సెల్ఫోన్లను, రెండు స్ప్లెండర్ బైక్లను, ఒక యాక్టివా మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఏ వన్ నిందితుడైన కళ్యాణ్ సిద్దిపేటకు చెందిన వాడని అతను పరారీలో ఉన్నాడని త్వరలో అతనిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.