Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ గిరిజన మోర్చా నగర అధ్యక్షులు చరణ్ సింగ్
నవ తెలంగాణ-అమీర్ పేట
అమీర్పేట డివిజనులోని పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోతోందని, పరిశుభ్రత మాటలకే పరిమితమైందని బీజేపీ గిరిజన మోర్చా నగర అధ్యక్షుడు చరణ్ సింగ్ అన్నారు.బాపూనగర్ బస్తీ సమీపంలోని నారాయణ జూనియర్ కాలేజ్ వద్ద పేరుకుపోయిన చెత్తను మీడియాకు శుక్రవారం చూపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చరణ్ సింగ్ మాట్లాడుతూ హైదరాబాద్ ను చెత్త నగరంగా మార్చడానికి పురపాలక శాఖ పనిచేస్తుందా అని ప్రశ్నించారు. స్వయంగా కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక శాఖలోనే నిర్లక్ష్యం కొట్టొనిచ్చినట్లు కనిపించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చెత్త పేరుకుపోతున్న విషయమై గత కొద్ది రోజుల క్రితం ఏఎంఓహెచ్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటి వరకు చెత్తను తొలగించలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేశ్ రాథోడ్, సాయి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.