Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ వజ్రా గ్రూప్, ఎంతో సౌకర్యవంతంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన బాంక్వెట్, కన్వెన్షన్, రిసార్ట్ సెంటర్ ఆహ్వానంను ప్రారంభించడం ద్వారా ఆతిథ్య వ్యాపారంలోకి మొదటసారిగా ప్రవేశించింది. నగరంలోని సరూర్ నగర్లో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హాజరై కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అంతకు మించి ఫేమ్ సతీష్ జై, బేవర్స్ ఫేమ్ సంజోష్, టాలీవుడ్ సినిమా ఏక్ ఫేం బిష్ణు అధికారి, నిర్మాత, దర్శకుడు సుమన్ ప్రసాద్, యురేఖా ఫేమ్ కార్తీక్ , వజ్రా గ్రూప్ డైరెక్టర్ టి.అరుణ్ కుమార్లు హాజరయ్యారు. నగరం నడిబొడ్డున 2.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మినీ రిసార్ట్గా ఏర్పాటైన ఆహ్వానం కన్వెన్షన్ సెంటర్ అన్ని రకాల సోషల్, కార్పొరేట్, మూవీ ఈవెంట్ కార్యక్రమాలకు, వేడుకలకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించేందుకు గమ్యస్థానం కానున్నది. ప్రస్తుత తరం కోరుకుంటున్న నాణ్యమైన పర్యావరణహితమైన సమావేశ కేంద్రాల కొరతను తీర్చేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్లో తమకున్న అపార అనుభవం, సానుకూలతలతో వజ్రా గ్రూప్ ద్వారా హాస్పిటాలిటీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని టి.అరుణ్కుమార్ అన్నారు. సంపూర్ణేష్ బాబు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆహ్వానం అత్యాధునికమైన కన్వెన్షన్ సెంటర్, ఇక్కడ నిర్వహించే వేడుకకైనా, సందర్భానికైనా ప్రత్యేక ఆకర్షణ తెచ్చి అతిథులకు మధురానుభూతిని అందిస్తుందని అన్నారు.