Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాచకొండపోలీస్ కమిషనరేట్ పరిధిల్లో అత్యాధునిక శానిటైజింగ్ బూత్ను సీపీ మహేష్భగవత్ ప్రారంభించారు. ఈ శానిటైజేషన్ నాలుగు దిక్కుల్లో పనిచేస్తుందని, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శుక్రవారం సీపీ తెలిపారు. చేతులతో ముట్టుకోకుండానే చేతులు కడుక్కోవడంతో పాటు శానిటైజ్ చేసుకోవచ్చని వివరించారు. శానిటైజింగ్ బూత్ను హిదుస్థాన్ యూనిలీవర్ సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఈ శానిటైజర్ను పోలీస్ సిబ్బందితోపాటు విజిటర్స్కూడా ఉపయోగించుకోవ చ్చన్నారు. ఇందుస్థాన్ యూనిలీవర్ సంస్థ ప్రతినిధి సౌరవ్ చతర్జీతోపాటు పలువురిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.