Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే శస్త్రచికిత్సతో గూనిని సరిచేసిన కిమ్స్ వైద్యులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
యుక్తవయసులో గూని వస్తే.. అదీ అమ్మాయిలకైతే వాళ్లు అనుభవించే నరకం వర్ణనాతీతం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 14 ఏండ్ల యువతికి ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. దాంతో ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని వెన్నెముక సమస్యల నిపుణులు డాక్టర్ సురేష్చీకట్ల వద్దకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నిజానికి రెండేండ్ల క్రితం ఆమెకు వీపు భాగంలో కొద్దిపాటి వాపు మాత్రమే ఉంది. కానీ ఆరు నెలల్లో గూని బాగా పెరిగిపోయింది. భుజాలు రెండూ ఒకే స్థాయిలో లేకపోవడం, వీపు మీద ఒక మూపురం లాంటిది రావడం లాంటి సమస్యలు వచ్చాయి. వాటివల్ల భౌతికంగా రూపం మారడంతో పాటు, ఆరోగ్యపరంగానూ సమస్యలు తలెత్తే ప్రమాదం వచ్చింది. ఎద భాగంలో ఊపిరితిత్తులకు తగినంత స్థలం లేకపోవడం వల్ల ఊపిరి అందడంలో ఇబ్బంది పడుతూ ప్రాణాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి తలెత్తింది. రోజురోజుకూ పరిస్థితి దిగజారుతుండటంతో యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె రూపం గురించి, సమాజంలో ఎదురయ్యే ఛీత్కారాల గురించి ఆందోళన చెందారు. చాలామంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా, ఉపయోగం లేకుండా పోయింది. పిల్లల్లో గూని సమస్యను సరిచేసే వైద్యుల గురించి వాళ్లు వెతుకుతుండగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని స్పైనల్ డిఫార్మిటీ కరెక్షన్ నిపుణుడు డాక్టర్ సురేష్చీకట్ల గురించి విన్నారు. దాంతోపాటు ఈ ఆసుపత్రిలో ఓ-ఆర్మ్, న్యూరో మానిటరింగ్, స్పైనల్ నేవిగేషన్ లాంటి అత్యాధునిక వైద్య పరికరాలు కూడా ఉండటంతో అత్యంత సంక్లిష్టమైన వెన్నెముక సమస్యలకు కూడా చికిత్స చేయడం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు. యువతికి తగిన ఎక్స్-రేలు, మొత్తం వెన్నెముకకు సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి వైద్య పరీక్షలు చేయడంతో ఆమెకు 'ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ టైప్ ఆఫ్ డోర్సల్ కైఫీస్కోలియాసిస్' అనే సమస్య ఉన్నట్టు నిర్ధారణ అయింది. శస్త్రచికిత్స చేయడానికి ముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, గుండె వైద్య నిపుణులు, పల్మనాలజీ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కిమ్స్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ సురేష్ చీకట్ల, డాక్టర్ రోహిత్ కిలారు, ఇంకా డాక్టర్ నరేష్ కుమార్ నేతత్వంలో కూడిన ఎనస్థీషియా బందంకలిసి శస్త్రచికిత్స చేసి.. వంకరగా, మూపురంలా వంగిపోయిన వెన్నెముకను 95శాతం వరకు సరిగా, చక్కగా చేయడంలో విజయవంతం అయ్యారు. దాంతోపాటు శస్త్రచికిత్స సమయంలో గానీ, ఆ తర్వాత గానీ ఎలాంటి సమస్యలూ తలెత్తలేదు. తర్వాతి రోజే రోగిని నడిపించారు. ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవగలిగారు. సాధారణంగా ఇలాంటి కేసులలో అస్థిపంజరం పూర్తిస్థాయిలో రూపొందడానికి ముందుగానే.. తగిన వయసులో సమస్యను గుర్తించడం, దానికి సరైనచోట సరైన చికిత్స చేయించడం చాలా ముఖ్యం. అప్పుడే తగిన ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.