Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
మహిళ మెడలో నుంచి తాళిబొట్టు ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు అందించిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న రామమూర్తి నవమణి(53) తన మనవరాలు త్రిషను ట్యూషన్ నుంచి బుధవారం సాయంత్రం 7.30 గంటలకు తమ బట్టల దుకాణానికి తీసుకొస్తున్న సమయంలో హౌజింగ్ బోర్డు కాలనీలో గల ఎస్బీఐ ఏటీఎం పక్కన గల్లీ నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్పై వచ్చి తన మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడును, వెనకాల కూర్చున్న వ్యక్తి ఎత్తుకెళ్లాడని తెలిపింది. సంఘటనా స్థలంలో అర్ధ తులం బంగారం దొరకగా, మిగిలిన బంగారాన్ని దోచుకెళ్లారనిఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్స్పెక్టర్ అప్పారావు తెలిపారు.