Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
హకీంపేట్ ఆర్టీసీ డిపోలో కుషాయిగూడ డివిజన్ మేనేజర్ జి. జగన్ అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపోలో ఉన్న అన్ని రికార్డులు పరిశీలించారు. అనంతరం డిపో అవరణలో పర్యటించి పరిసరాలను పర్యవేక్షించారు. పరిసరాలు శుభ్రంగా ఉండడంతో అదేవిధంగా రికార్డులు సక్రమంగా ఉండటంతో డిపో మేనేజర్ భాస్కర్ రెడ్డి ని అభినందించారు. సిబ్బందికి పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని డిపో ను లాభాల్లో తీసుకొని రావాలని కోరారు. కార్యక్రమంలో రవి కాంత్, గారెజ్ సిబ్బంది, గోపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.