Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారా హిల్స్
ఆశ వర్కర్లకు కివిడ్ టీకాలను వేసే ప్రక్రియ నూతన శాఖను వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటిగా ఆశ వర్కర్లకు వేయడం గమనార్హం. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తూ వారందరికీ కరోనా నివారణ టీకాలు వేసి జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి వారితో కలిసి టీకా ప్రక్రియ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారి ఆరోగ్య బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది వైద్యేతర సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.