Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ప్రభుత్వం దళితుల కోసం గత 70 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 87 లో 2.32 ఎకరాల పట్టా దారులుగా ఎస్సీలకు భూములు ఇచ్చిందని, మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం కోసం అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సబబు అని సీపీఐ మండల కార్యదర్శి పాలబిందాల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బాధితులతో కలిసి బుధవారం బాచుపల్లి మండల తహసీల్దార్ భూపాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశానుసారం మార్కెట్ యార్డ్ కేటాయించినట్లు బాధితులకు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాంపేటలోని సర్వే నెంబర్ 87 లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఆశి లచ్చయ్య, ఆశి బిక్షపతి , ఆశి గణేష్, ఆశి రాజయ్య లకు గతంలో పట్టాలు ఇచ్చారని చెప్పారు. సంవత్సరాల తరబడి వీరూ లావణ్య పట్టా గ్రామ పంచాయితీ కింద సైతం భూమిలో సాగు చేశారని , అప్పటి నుంచి ధ్రువ పత్రాలు వీరి పేర్లతోనే ఇప్పటికీ ఉన్నాయని కోర్టుకు వెళితే బాధితులకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చింది అని చెప్పారు. అప్పుడు భూములు కేటాయించిన వారిలో ముగ్గురు వరకు చనిపోవడంతో ఇక భూములు భూములు వారికి వర్తించవని తెలుపుతూ అధికారులు అట్టి భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించామని తెలపడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ప్రతినిధులు బాధిత దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆశి బాల నరసమ్మ, ఆశి కల్పన, ఆశి అండాలు, ఆశి ధనమ్మ, ఆశీ వసంత, ఆశి అరుణ, ఆశి రామయ్య, ఆశి పోచయ్య, ఆశి నర్సింగరావు, రాజు, ఆశి నాగేష్, జితేందర్ పాల్గొన్నారు.