Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారా హిల్స్
నీటి కాలుష్యలు కలగకుండా చూడాలని కార్పొరేటర్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి అన్నారు. నీటి కాలుష్యం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని ఇటీవలే నూతనంగా వేసిన పైప్ లైన్ పనులు లీకేజీలు అవడంతో మంచినీరు మురుగునీరు కలిసి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏది మంచి ఏది మురుగునీరు తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదుతో అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన పైప్లైన్ పనులను కార్పొరేటర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ తట్టిఖాన వాటర్ బోర్డు మేనేజర్ పెరిక అన్వేష్, వర్క్ ఇన్స్పెక్టర్ హఫీజ్ హమ్మద్, కాంట్రాక్టర్లు సురేష్,అబ్జాల్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.