Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2.5లక్షల విలువైన బంగారం స్వాధీనం
నవతెలంగాణ-బేగంపేట్
రైళ్ళలో ప్రయాణిస్తూ ప్యాసెంజర్ల బ్యాగులను విలువైన వస్తువులను దొంగిలిస్తున్న పాత నేరస్తున్ని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 2 లక్షల 50 వేల రూపాయల విలువైన యాభై రెండు గ్రాముల బంగారం, 52 వేల నగదు ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అనురాధ వెల్లడించారు. వివరాలు ఇలా.. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన వివేకానంద అనే వ్యక్తి గచ్చిబౌలిలో నివాసం ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫారవమ్, రైల్వే స్టేషన్ గేట్ వద్ద దొంగతనాలు చేసేవాడు. అతనిపై గతంలోనే అనేక దొంగతనం కేసులో నమోదయ్యాయని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో కూడా అతనిపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.. దొంగతనాలకు అలవాటు గా మార్చుకుని 16 చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. ప్రయాణికులు అపరిచిత వక్తులతో అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను తీసుకు వెళ్లెప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.