Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ గోపి
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు తెలంగాణ పురపాలక చట్టం నిబంధనలు పాటిస్తూ టి ఎస్ బి పాస్ అనుమతులు పొందిన తరువాతే నిర్మాణాలు చేపట్టాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకున్నామని నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ గోపి తెలిపారు. బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ గోపి ఆదేశాల మేరకు నిజాంపేట్ నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణాలు చేపట్టే బిల్డర్ ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డర్ ల తో కమిషనర్ గోపి మాట్లాడుతూ అనుమతులు పొందిన ప్రకారమే నిర్మాణం చేపట్టాలని, అదనపు అంతస్తులు చేపడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని, నిబంధనలకు విరుద్ధంగా బహుళఅంతస్తుల నిర్మాణాలు చేపట్టితే చర్యలు తప్పవని, ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ వారు నోటీసులు జారీ చేశామని, నిబంధనలను ఉల్లంఘించి పనులు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పాసుల పొందిన నిర్మాణాలు చేయాలని, హెచ్ఎండీఏ టెక్నికల్ అప్రూవల్ పొందిన భవన నిర్మాణాలను నగరపాలక సంస్థ నందు అనుమతులు తీసుకున్న తరువాతనే నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు. అన్ని అనుమతుల ప్లానులు, ఉన్నా కానీ నిర్మాణం జరిగే భవనం నందు డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే వ్యర్ధాలను రహదారి వెంట వేయకుండా చూడాలని సాధారణ ప్రజల కు ఆసౌకర్యం కలుగకుండా చూడాలని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఉదయశ్రీ, బిల్డరుపాల్గొన్నారు.