Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో పాఠశాల గదులను హైపోక్లోరైడ్ రసాయనాలతో పిచికారీ చేయిస్తామని మేడ్చల్ మండలం గౌడవెల్లి సర్పంచ్ గరిశెల సురేందర్ అన్నారు. బుధవారం గ్రామంలోని స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉపాధ్యాయులు, కషి హోం ప్రతినిధులు, స్థానిక వార్డు సభ్యులు పాల్గొన్నారు.