Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడిస్తున్నా అభివృద్ధి మాత్రం నత్తనడకనే సాగుతుందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి శ్రీరాములు అన్నారు. బుధవారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్ గ్రామంలో కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీరాములు యాదవ్ను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సబితాఇంద్రా రెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలేసి తన స్వప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీలోకి చేరారని విమర్శించారు. ఎన్నికల సమయంలో గుర్రంగూడలో ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో సహకార బ్యాంకు మాజీ చైర్మెన్ పి.పుల్లారెడి, డైరెక్టర్ పి.సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలంచారి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.