Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఘణపూర్ రెవెన్యూ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రహారి నిర్మాణంపై చర్యలకు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ఘణపూర్ పాలకవర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మైసమ్మ గుట్ట వద్ద ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేస్తున్న వెంచర్లోసర్వేనెంబర్ 1139 ఘణపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోనికి వస్తుందని, పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహారి నిర్మిస్తున్నారని, పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించడంతో పాటు కలెక్టర్కు ఫిర్మాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయనందున్న వాటి మరమ్మతులు, డ్రెయినేజీ, పారిశుధ్య పనులు పూర్తి చేయడానికి తీర్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రవి, కార్యదర్శి మధు, వార్డు సభ్యులు వేముల పరమేష్ గౌడ్, వేముల హేమంత్ గౌడ్, వేముల శోభ, వర్త్య పవన్ నాయక్, మందుల మయూరి, గుగులోత్ కాంతమ్మ, వేముల పద్మ, వేముల శ్వేత, చిలుగూరి భాస్కర్, కో ఆప్షన్ సభ్యులు నానావత్ సురేష్ నాయక్, లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.