Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొవిడ్-19 సమయంలో కాలేయ మార్పిడి అవసరమైన రోగుల్లో సగం మంది మృతి చెందుతున్నారని కరోనా వైరస్ అన్న భయంతో ఆలస్యం చేయడమే మరణాలకు కారణమని గ్లోబల్ ఆస్పత్రి హెడ్ సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర బాబు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలేయం పరిస్థితి విషమించినప్పుడు మార్పిడి తప్పా రోగికి వేరే మార్గం లేనప్పుడు, శస్త్ర చికిత్సకు ఆలస్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఇతర కారణాలతో కొందరు రోగులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఇలా ఈ చికిత్సలను ఆలస్యం చేయడం వల్ల రోగులు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు లక్డికపూల్ గ్లోబల్ ఆస్పత్రిలో తమ వైద్య బందం 30 మందికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిందనీ, అన్నీ వందశాతం విజయవంతమయ్యాయని చెప్పారు.