Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారతదేశ, నేపాల్ దేశ శాంతి రాయబారి డా.రామ్ తిలక్ చెరుకూరికి దేశ రాజధాని ఢిల్లీ శాంగ్రీలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక భారత్ గౌరవ రత్న అవార్డును కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి, ప్రముఖుల చేతుల మీదగా అందుకున్నారు. రాంతిలక్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు పేద ప్రకజలకు వైద్య, ఆరోగ్య, అన్నదానం, అనాధ పిల్లలకి విద్య, సేవలందించినందుకు గాను గుర్తుంచి ఈ అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా డా.రామ్ తిలక్ చెరుకూరి మాట్లాడుతూ భారత్ గౌరవ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసే వారిని గుర్తించి ప్రోత్సహించడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా తనకి ఈ పురస్కారం రావడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు వచ్చినందుకు గీతం ఫౌండేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.