Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్తో కలిసి ఆర్డీవోలు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్నిచోట్ల ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాకేంద్రంలో జరిగే వేడుకలకు సంబంధించి ఆయా అధికారులకు బాధ్యతలు అప్పగించామని, ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలన్నారు. అలాగే ప్రముఖులు, వీఐపీలు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబాలకు ఆహ్వానాలు పంపాలని చెప్పారు. అనంతరం కరెంట్, ఫైర్స్టేషన్, పోలీసులు బందోస్తు విషయంలో అధికారులకు వివరించారు. సమావేశంలో ఆర్డీవోలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.