Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
హెల్మెంట్ లేకుండా ప్రయాణించే వాహనదారులపై కఠినచర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించకుండా బైక్నడిపే 40మందికి ఛలాన్లు విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 17వరకు ప్రతీరోజు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు లకన్ రాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.