Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేదలను మానవత్వంతో ఆదరించి చేయూతనందించడం మానవ ధర్మంగా భావించాలని మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు, ఇద్దయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మెన్ శివరాత్రి యాదగిరి అన్నారు. బుధవారం జనగాం జిల్లా కొడకండ్ల మండలం గ్రామ కేంద్రంలో ట్రస్టు ఆధ్వర్యంలో డైరెక్టర్ మంగ, డాక్టర్ శృతివిద్య, నిఖిల్, సాయితేజ, సర్పంచ్ పసునూరి మధుసూదన్లతో కలిసి 100 మంది పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ గత కొన్నేళ్ల క్రితం తన తండ్రి శివరాత్రి ఇద్దయ్య పేరున చారిటబుల్ ట్రస్టు స్థాపించి స్వచ్ఛంద, సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కొడకండ్ల ఎస్ఐ వెంకన్న, వార్డు సభ్యులు కె.హరీష్ తదితరులు పాల్గొన్నారు.