Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
యువతిని వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాచకొండ సీపీ మహేష్భగవత్ తెలిపిన వివరాల మేరకు బోనగిరి, సంతోష్నగర్కు చెందిన సి.శ్యామ్ తుర్కపల్లిలోని చైనీస్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఓ అమ్మాయి ఫోన్ నెంబర్ సేకరించిన నిందితుడు వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు స్పందించకపోవడంతో ఈ నెల 2న ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసిన అసభ్యకరమైన చిత్రాలను రాత్రి సమయాల్లో బాధితురాలి వాట్సాప్లో పోస్టు చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా అసభ్యకరమైన తీరులో మాట్లాడుతూ వాయీస్ మెసేజ్లు పంపిస్తున్నాడు. రోజురోజుకు నిందితుడి వేధింపులు అధికం కావడంతో బాధితురాలు సైబర్క్రైమ్ పోలీసులను అశ్రయించారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.