Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తొలగించిన బీసీ జాబితాలోని 26 కులాలను వెంటనే చేర్చాలని బీసీ కులాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జాబితాలోని 26 కులాలను తొలగించటంతో విద్యార్థులు, ఉద్యోగులు అన్ని రంగాల్లో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సుమారు 10 లక్షల మంది విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనక్కి నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సమాఖ్య రాష్ట్ర నాయకులు జాజుల నరేష్, ఎస్.వెంకటేశ్వర్లు, ప్రసాద్, కిరణ్ కుమార్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.