Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
లాలాపేట్ ప్రొ.జయశంకర్ స్టేడియంలో గత కొంతకాలంగా నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సులను వెంటనే తొలగించాలని వాకర్స్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం స్టేడియంలో బస్సుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్టేడియంలో బస్సులు తొలగించాలని పలుమార్లు అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పలు రూమ్స్లోస్టేడియానికి సంబంధంలేని సామగ్రిని భద్రపర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.తక్షణమే స్టేడియంలో బస్సులు తొలగించాలని కోరారు.