Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయం దుట ఆర్టీజన్ కార్మికుల ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రస్తుతం సంస్థలో ఉన్న (ఏపీ ఎస్ఈబీ) రూల్స్ కాకుండా స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ పేరుతో ఫ్యాక్టరీ రూల్స్ అమలు చేసి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సాయిలు అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 23,668 మంది ఆర్టిజన్ కార్మికులకు సీఎం అసెంబ్లీ సాక్షిగా రెగ్యులర్ చేస్తున్నామని చెప్పినా.. విద్యుత్ యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వాదేశాలు ధిక్కరించే విధంగా వ్యవహరిస్తుండటాన్ని నిరసిస్తూ ఆర్టిజన్ కార్మికులు మింట్ కాంపౌండ్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం లంచ్ అవర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒక పర్మినెంట్ చెప్పి మరో వైపు ప్రయివేటు కార్మికులుగా పరిగణిస్తున్నారని తెలిపారు. కార్మికులకు క్యాజువల్, ఎర్న్డ్, మెడికల్, మెడికల్ అనఫిట్, ఈపీఎఫ్ సెయిలింగ్ ప్రయివేటు కార్మికులకు అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ప్రయివేటు సంస్థలో పని చేస్తున్న విధంగానే ఉందన్నారు. తక్షణమే ఫ్యాక్టరీ రూల్స్ను ఎత్తేసి ప్రస్తుతం ఉన్న ఏపీఎస్ఈబీ రూల్స్ను ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేపట్టడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఇద్దరు, ముగ్గురు పని చేసే సబ్స్టేషన్లలో నాలుగో ఆపరేటర్ను నియమించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను అమలు చేయాలని డిమాండ్ చేశారు.