Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
మైనింగ్ మాఫియా నుంచి అన్యాక్రాంతమైన ప్రభుత్వ చెరువులను కాపాడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. సీపీఐ(ఎం) పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బండ రావిరాలగ్రామ రెవెన్యూ పరిధిలోని ఫుల్చర్ల చెరువు, కుమ్మరి కుంట, కొత్తచెరువులను స్థానిక మత్స్యకారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండ రావిరాల పరిధిలోని చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయని, మైనింగ్ మాఫియా నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత వారం చెరువులను సీపీఐ(ఎం) బందం పరిశీలించి అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ చెరువులను పరిరక్షించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రభుత్వం భూముల, చెరువులు అక్రమాలపై ఇప్పటికీ అధికారులు చర్యలు చేపట్టక పోవడం దారుణం అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ, బీసీ సబ్ ప్లాన్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ నాయకుడు శివకుమార్ పాల్గొన్నారు.
నేడు సీఐటీయూ జీపుయాత్ర
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జీపు యాత్రలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్ పేటలో గురువారం జీపు యాత్రను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. వీరయ్య ప్రారంభించనున్నట్లు మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహ తెలిపారు