Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవయవ తరలింపులో కీలక పాత్ర పోషించిన ట్రాఫిక్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కిమ్స్ ఆస్పత్రిలో ఓ రోగికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డాక్లర్లు ట్రాఫిక్ పోలీసుల సహాయసహకారాలను కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. అవయాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ఎక్కడ ఆగకుండా సకాలంలో ఆస్పత్రికి చేరేలా చర్యలు చేపట్టి రోగి ప్రాణాలను కాపాడారు. బుధవారం అదనపు సీపీ, ట్రాఫిక్ బాస్ అనిల్కుమార్ తెలిపిన వివరాల మేరకు నగరానికి చెందిన ఓ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఊపిరి తిత్తుల సమస్యతో బేగంపేట్లోని కీమ్స్ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఊపిరి తిత్తులు వెంటనే మార్చాల్సిన పరిస్థితి రావడంతో వైద్యులు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాలతో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. శంషాబాద్ ఏయిర్పోర్టు నుంచి బేగంపేట్లోని కీమ్స్ ఆస్పత్రికి (లైవ్) ఊపిరి తిత్తులను అంబులెన్స్లో తీసుకొచ్చారు. దాదాపు 36.8 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 29 నిమిషాలో చేర్చారు. మార్గమధ్యలో ఎక్కడ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా రెండు కమిషనరేట్ల పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ను నియంత్రించారు. మధ్యాహ్నం 2:19 నిమిషాలకు ఏయిర్పోర్టు నుంచి బయలు దేరిన అంబులెన్స్ మధ్యాహ్నం 2.48నిమిషాల్లో ఆస్పత్రికి చేరడంతో డాక్టర్లు రోగికి సకాలంలో ఆపరేషన్ చేయగలిగారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో రోగి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు డాక్టర్లతోపాటు పూర్తిగా సహకరించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.