Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ మేయర్, బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బండ కార్తీక చంద్రారెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట్, ఇసుకబావి, శాంతినగర్ చౌరస్తా, చింతల్, సీతాఫల్మండి చౌరస్తాలలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాలలో బీజేపీ సీనియర్ నాయకులు బండ చంద్రా రెడ్డి, మహంకాళి జిల్లా కార్యదర్శి వీరన్న, ప్రకాష్, వేణు యాదవ్, పోచయ్య యాదవ్, సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్, గణేష్ ముదిరాజ్, కష్ణ గౌడ్, కిరణ్ గౌడ్, కరుణాకర్, అనూష, జయమ్మ సంపత్ టెంపుల్ సాయి లడ్డు చిన్ని కష్ణ పాల్గొన్నారు.