Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో సర్పంచ్ వంగూరి శివశంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డిలు పాల్గొని అంబేద్కర్కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మలిపెద్ది వెంకట్ రాంరెడ్డి, ఉపసర్పంచ్ ఆబెదాబేగం, వార్డు సభ్యులు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జోగు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు చెరుకూరి సురేష్ ప్రవీన్, చెరుకూరి రాజు తదితరులు పాల్గొన్నారు.