Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
రాజ్యాంగ లక్ష్యాలను ఖూనీ చేస్తూ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను అంతం చేయడానికే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వి.ఎస్.బోస్ ఆరోపించారు. బుధవారం హిమాయత్ నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద సీపీఐ, ఏఐటీ యూసీ సంయుక్త ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, తదితరులు అంబేద్కర్ చిత్రప టానికి ఫూలమాలలు వేసి నివాళ్లర్పించి, రాజ్యాంగ పరిర క్షణ దినంగా పాటించారు. ఈ సందర్బంగా వి.ఎస్.బోస్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, సంఫ్ు పరివార్ శక్తులు ఎల్ల ప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఆనాడు దళితుల అభ్యున్నతి కోసం పార్లమెంట్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెడుతుంటే పార్లమెంట్ బయట వారు అంబే ద్కర్ దిష్టి బొమ్మను తగులబెట్టారని గుర్తు చేసారు. స్వాత ంత్రం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా దేశంలోని దళితులు, గిరిజనులు, ఓబీసీలు చాలా మంది విద్య, సామాజికం, ఆర్థికంగా అట్టడుగునే ఉన్నారనీ, అసమానతలను అధిగ మించడానికి రిజర్వేషన్లు కీలకమన్నారు. రాజ్యాంగ హక్కు లను కాలరాస్తూ, హానికరమైన చట్టాలను తీసుకొచ్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దళిత బహుజనుల సాంఘిక, ఆర్ధిక అభ్యున్నతికి అంబేద్కర్ తీవ్రంగా పోరాడి సాధించిన రిజర్వేషన్లను తొలగించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చెడు కుట్రలను అడ్డుకుంటామ న్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులపై మోదీ ప్రభుత్వ క్రూరమైన దాడులను ఎదుర్కోవడానికి పెద్దఎత్తున మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ.టి.నరసిం హ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకతీతంగా దేశం లోని పౌరులందరూ సమానంగా అభివృద్ధి చెందుతూ జీవి ంచాలని అంబేద్కర్ రచించి జాతికి అంకితం చేసిన భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని దుష్ట శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యున్నత రాజ్యాంగం భారతదేశానిదనీ, ఇప్పుడు అదే రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే శక్తుల నుంచి రాజ్యా ంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కమతం యాదగిరి, ఎం.నర్సింహ, ఆర్.బాల కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు బి.వెంకటయ్య, బొడ్డుపల్లి కిషన్, రమేష్, ఆనంద్ రెడ్డి, సర్వేశ్, కృష్ణ, లతీఫ్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఆరుట్ల రాజ్ కుమా ర్, బి.కుమార్, బి.శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ నాయకులు బి.స్టాలిన్, గ్యార నరేష్, కంపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.