Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొరికితే రూ.వెయ్యి జరిమానా
- మాస్కులు ధరించడంలో నిండా నిర్లక్ష్యం
- నిబంధనలు పాటించకుంటే కేసులు : సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా నివారణకు శానిటైజర్లు వాడాలనీ, మాస్కులను తప్పని సరిగా ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలంటూ అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. ప్రజలను చైతన్య పర్చ డంలో అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అయి నా చాలా మంది నిర్ణక్ష్యాన్ని వీడటం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో నన్నెవరు చూస్తారులే అని కొందరు, పక్క దుకాణానికే వెళ్తున్న కదా.. అని మరికొందరు మాస్కులు ధరి ంచడంలో నిర్ణక్ష్యం వహిస్తున్నారు. ఇంకొందరు మాత్రం మాస్క్లు ధరించకుంటే ఏమౌతుంది... నాకు కరోనా రాదులే అనే తీరులో వ్యవహరిస్తు న్నారు. చాలా మంది పదేపదే శానిటైజర్ వాడితే చర్మం పాడవుతుందని వాడటం మానేశారు. ఇదిలా ఉండగా మరికొంత మంది భౌతిక దూరా న్ని మర్చిపోయారు. వింధులు, శుభకార్యాల్లో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. మాస్కులు ధరిం చడంలో నిర్ణక్ష్యం వహిస్తున్నారు. ఇక గల్లీ నుంచి ప్రధాన రోడ్ల వరకు ఎక్కడ చూసినా నగరవా సులు గుమిగూడుతున్నారు. ఆరుబైట కూర్చొని మంతనాలు కొడుతున్నారు. ఒకే వాహనంపై ఇద్దరు, ముగ్గురు ప్రయాణిస్తున్నారు. మార్కెట్లు, సినిమా హాళ్లు, మాల్స్లో రద్దీ పెరిగింది. రోడుపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. వీరి నిర్ణక్ష్యంతో కరోనా మరింత విజృంభిస్తోంది. దీంతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యా రు. మాస్క్లు పెట్టుకోని వారికి పోలీసులు నేరు గా ఫైన్ వేస్తున్నారు. కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో గుంపులు గుంపులుగా ఉన్న వారినీ, మాస్క్లు పెట్టుకోకుడా వాహనం నడిపే వారిని కెమెరాలో బంధి స్తున్నారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ రూం లో పరిశీలించి ఈ-చలానాలు పంపిస్తున్నారు.
832 మందికి ఫైన్
రోజురోజుకూ కరోనా ఆందోళన కలిగిస్తో ంది. సెకండ్ వేవ్తో వేలామంది కరోనా భారిన పడుతున్నారు. అయితే కొందరు నిర్ణక్ష్యం వహి స్తున్నారు. రాచకొండ పరిధిలో మాస్కులు ధరిం చని వారిపై ఈ-చలాన్ ద్వారా కేసు నమోదు చేసిన పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధి స్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తున్నారు. మంగళవారం మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమో దు చేశారు. మాస్కులు ధరించాలనీ, కరోనా నిబంధనలు పాటించాలని రాచకొండ పోలీ సులు వైరస్పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నారు.
నిర్ణక్ష్యం వద్దు.. జాగ్రత్తలే సేఫ్..
రెండో వేవ్ కరో నా విజృంభిస్తోంది, ని ర్లక్ష్యం చేస్తే భారీ మూ ల్యం చెల్లించుకోక తప్ప దు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్య ంలో ప్రజలంతా జాగ్రత్త ఉండాలి. ప్రభుత్వం విధిం చిన నిబంధనలను తప్పని సరిగా పాటి ంచాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ వాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదువేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పెళ్లిళ్ల్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు వందల మంది కంటే ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్త వహించాలి. నిబంధనలు అతిక్రమించి న వారి పై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
రాచకొండ సీపీ మహేష్ భగవత్