Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో మంచి మార్పు కోసం జీవితాంతం పరితపించిన మేధావి , సంస్కర్త , దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రవాణాశాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు కొనియడారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్టు భవన్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల శ్రేయస్సును కాంక్ష్షించి వారి జీవితాలు బాగుండాలని పరితపించిన ఆ మహనీయుడి ఆలోచన విధానం మార్గ్గదర్శకమని కీర్తించారు. దేశంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన అంబేద్కర్ ఆశయాల అడుగు జాడలు స్ఫూర్తిదాయకమని శ్లాఘించారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మంచి మార్పునకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఎంఆర్ఎం రావు కోరారు. కార్యక్రమంలో జేటీసీలు జె.పాండురంగ నాయక్, సి.రమేష్, డీటీసీ కె.పాపారావు, సీనియర్ ఎంవీఐ పర్వీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.