Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను తెలుసుకొని జీవనాన్ని కొనసాగించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ విలువలతో కూడిన జీవనాన్ని కొనసాగించే ప్రక్రియను అలవర్చుకోవాలని యువతకు సూచించారు. ముందుగా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ఎంతో అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నిరుపేద యువత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలను అందుకుంటున్నారంటే ఆయన లిఖించిన రాజ్యాంగ స్ఫూర్తితోనేనని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, విజరు, దళిత నాయకులు విజరు, రామచంద్రరావు, జలాల్ తదితరులు పాల్గొన్నారు.